కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ), ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (ఐసీఎస్ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్సీ) సెలబస్ను 25 శాతం మేర తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సర సిలబస్ను 25 శాతం తగ్గించింది. సవరించిన సిలబస్ అధికారిక వెబ్సైట్ cisce.org లో లభిస్తుంది. 9 నుండి 12వ తరగతుల విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి తాజా సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్త లాక్డౌన్, కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలలు గత మూడు నెలలుగా మూసివేయబడ్డాయి. అయినప్పటికీ సీఐఎస్సీఈ అనుబంధ పాఠశాలలు ఆన్లైన్ మోడ్లో తరగతులను తాత్కాలికంగా నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిలబస్ను తగ్గించింది. 2020-21 విద్యాసంవత్సరాన్ని కుదించింది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా సిలబస్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, అదేవిధంగా నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలిపారు.
నీట్ పరీక్ష సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థుల భద్రత, విద్య రెండూ ముఖ్యమేనని హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ పేర్కొంది.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి