చైనాతో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారిగా లడక్లో ప్రత్యక్షమయ్యారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి ఆయన లడక్ వెళ్లారు.
నీములో ప్రధానికి లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ అన్ని వివరాలు తెలిపారు. భారత సైన్యం తరపున హరిందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను మోదీ పరామర్శించనున్నారు.
ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవణే లడక్ వెళ్లారు. చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. చైనా బలగాల దాడిని తిప్పికొట్టిన భారత జవాన్లకు ప్రశంసా పత్రాలు కూడా అందించారు.
ఎల్ఏసీ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులతో నేరుగా మాట్లాడి వారిలో స్థైర్యం నింపారు. వాస్తవానికి ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేహ్లో పర్యటించాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ను మార్చేశారు. దీంతో ఇవాళ ఉదయం మోదీ .. లడఖ్ చేరుకున్నారు.

More Stories
ప్రముఖ జర్నలిస్ట్, మాజీ దౌత్యవేత్త హెచ్.కె.దువా మృతి
భారత చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్
సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్.. శ్రీనగర్ ఎంపీ, మాజీ మేయర్పై కేసు