
హరిద్వార్లోని మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 25 మంది భక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హరిద్వార్ ఎస్ఎస్పీ తెలిపారు. మానసాదేవి ఆలయంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తున్నది. ఘటనకు కారణాలు తెలియరాలేదు.
సమాచారం అందుకున్న గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే సంఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రస్తుతం ఆలయం వద్ద అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
జులై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత, లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికీ హరిద్వార్కు చేరుకున్నారు. శని ఆదివారాల కారణంగా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతోనే మానసాదేవి ఆలయానికి వెళ్లే రెండు కిలోమీటర్ల నడక మార్గంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.
పెద్ద సంఖ్యలో గుమిగూడిన నేపథ్యంలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. కొందరు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా, మరికొందరు ముందుకు చొచ్చుకురావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో చాలామంది ఊపిరాడక పడిపోయగా వారందరినీ అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తొక్కిసలాట ఘనటపై ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు తెలిపారు.
“హరిద్వార్లోని మానసా దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగినట్లు విచారకరమైన వార్తలు అందాయి. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసుల, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయంలో నేను నిరంతరం స్థానిక పరిపాలనతో సంప్రదిస్తున్నాను. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. భక్తులందరి భద్రత కోసం నేను మాతా రాణిని ప్రార్థిస్తున్నాను” అంటూ ముఖ్యమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం