జమ్ముకాశ్మీర్లో చేపట్టిన ఆపరేషన్ కెల్లర్లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సమన్వయంతో కెల్లార్, షోపియాన్ మరియు ట్రాల్ల్లో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.కె.బిర్డి తెలిపారు. శుక్రవారం అవంతిపొరాలో భద్రతా దళాల సంయుక్త సమావేశంలో వి.కె. బిర్డి, మేజర్ జనరల్ ధనుంజరు జోషిలు మాట్లాడారు.
48 గంటల్లో రెండు విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించారని బిర్డి పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈప్రాంతంలో మోహరించిన అన్ని భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించాయని పేర్కొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మేజర్ జనరల్ జోషి పేర్కొన్నారు. మృతి చెందిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన షాహిద్ కుట్టీ రెండు ప్రధాన దాడుల్లో పాల్గొన్నాడని, వాటిలో జర్మన్ పర్యాటకుడిపై దాడి ఒకటని, ఉగ్రవాదులకు నిధులు అందించాడని తెలిపారు.
“ఇక్కడ ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను అంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో వారి వ్యూహాలను సమీక్షించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో మోహరించిన అన్ని భద్రతా సంస్థలు కార్యకలాపాలపై తీవ్ర దృష్టి పెట్టడం వల్లే ఈ విజయవంతమైన ఆపరేషన్లు జరపగలిగాము” అని తెలిపారు.
కేలార్లోని ఉన్నత ప్రాంతాలలో ఉగ్రవాద సంస్థ ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందిన తర్వాత మే 12న ఆపరేషన్ ప్రారంభించబడిందని బ్రీఫింగ్లో కూడా పాల్గొన్న మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు. సాయుధ బృందాలు మే 13 ఉదయం ఉగ్రవాదుల కదలికను గుర్తించాయి. సవాలు విసరడంతో, ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తరువాత జరిగిన కాల్పుల్లో వారిలో ముగ్గురు మరణించారని ఆయన పేర్కొన్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు ట్రాల్ ప్రాంతంలోని సరిహద్దు గ్రామంలో రెండవ ఆపరేషన్ నిర్వహించారు.
“మేము గ్రామంలో ఒక ముట్టడిని ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో మోహరించి మాపై కాల్పులు జరిపారు” అని ఆయన చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ రెండు ఎన్కౌంటర్లు జరిగాయి, ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు.ఈ సంఘటన భారతదేశం పాకిస్తాన్ మరియు పిఓకెలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడానికి ప్రేరేపించింది మరియు సైనిక కార్యకలాపాలకు విరామం ప్రకటించే వరకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.
కాగా, బుద్గాం జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం అరెస్ట్ చేశాయి. వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని తెలిపాయి. వీరి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేసినట్లు వివరించాయి. ఈ ప్రాంతంలో వీళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడడమే కాకుండా స్థానికులను ఉగ్రవాదం వైపు మళ్లీంచేందుకు ప్రోత్సహిస్తున్నారని చెప్పాయి.
ఈ ముగ్గురు ముజామిల్ అహ్మద్, ఇషాక్ పండిట్, మున్నీర్ అహ్మద్గా గుర్తించామని, వీరిని మగమ్లో అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. లష్కరే తోయిబా సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న అబిద్ ఖయ్యుమ్ లోన్తో నేరుగా సంప్రదింపులు జరిపేంత చనువు వీరికి ఉందని తెలిపారు. 2020లో అబిద్ ఖయ్యుమ్ లోన్.. పాకిస్థాన్ పారిపోయి.. లష్కరే తోయిబాలో చేరాడని వివరించాయి.
ఇతరు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తూ బద్గాం జిల్లాలోని ప్రజలను ఉగ్రవాదం వైపు మళ్లీంచేందుకు సన్నాహాకాలు చేపడుతున్నాడని తెలిపాయి. అతడి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఈ ముగ్గురు పని చేస్తున్నారని భద్రతా దళాలు వివరించాయి. అయితే వీరిని విచారిస్తున్నామని భద్రతా దళాలు తెలిపాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు