
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత. ఈ నిర్ణయంతో సింధు, దాని ఉపనదులైన జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నుంచి పాకిస్థాన్కు నీటి సరఫరాను ఆపేస్తారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును పాక్ విశ్వసనీయంగా, కచ్చితంగా నిలిపివేసేదాకా ఈ ఒప్పందం అమలు కాదని భారత్ ప్రకటించింది.
వాఘా- అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ తక్షణ మూసివేత. సరైన పత్రాలతో ఆ దారి గుండా ఇప్పటికే భారత్లోకి ప్రవేశించినవారు మే1లోపు అదే మార్గంలో వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే అలా వచ్చినవారి వీసాలు రద్దయిపోతాయి. ఈ మినహాయింపు కింద భారత్లో ఉన్న పాక్ జాతీయులందరూ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
న్యాయమూర్తులు, చట్టసభల సభ్యులు, సీనియర్ అధికారులు, వాణిజ్య ప్రముఖులు, పాత్రికేయులు, క్రీడా ప్రముఖులు.. ఇలా 24 కేటగిరీలకు చెందిన ప్రముఖులు సార్క్ దేశాల మధ్య వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుగా 1992లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఆయా కేటగిరీలకు చెందిన ప్రముఖులకు వారి వారి దేశాలు ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక వీసా స్టికర్ ఇస్తాయి. ఆ స్టికర్ ఉంటే సార్క్ దేశాలకు వారు సంప్రదాయ వీసా లేకుండానే ఎన్నిసార్లయినా రావొచ్చు, పోవచ్చు.
పాకిస్థానీ హైకమిషన్లో ఉన్న రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ అవాంఛిత వ్యక్తులుగా (పర్సొనా నాన్ గ్రేటా) ప్రకటించింది. వారం రోజుల్లోగా వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే ఇస్లామాబాద్లో ఉన్న భారత హైకమిషన్లోని రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ భారత్ ఉపసంహరించుకుంది.
ఆ పోస్టులన్నీ రద్దు చేసింది. రెండు దేశాల్లోని హైకమిషన్లలో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- 1960లో పాక్తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందచేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లు పాక్ నుంచి స్పష్టమైన, విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
- అటారీ-వాఘా సరిహద్దు చెక్పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధమైన పత్రాలతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్థానీ పౌరులు మే 1వ తేదీలోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని భారత్ ప్రకటించింది.
- సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీ జాతీయులు భారత్లో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. పథకం కింద గతంలో పాకిస్థానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్థానీ జాతీయులు 48 గంటల్లోగా భారత్ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది.
- ఇస్లామాబాద్లోని భారతీయ హై కమిషన్ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అదే విధంగా ఢిల్లీలోని పాకిస్థానీ హై కమిషన్లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోగా భారత్ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
- భారత్లోని పాక్ హై కమిషన్లలోని దౌత్యాధికారుల సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించాలని పాకిస్థాన్ను ఆదేశించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
More Stories
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్