
ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. తమకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. భారత రాయబారి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ. ‘పాకిస్థాన్ నాయకులు, ప్రతినిధులు వారి సైనిక ఉగ్రవాద సమూహం నిర్దేశించిన అబద్ధాలను ప్రచారం చేయడం విచారకరం. ఇస్లామిక్ దేశాల కూటమిని తన వాణిగా మార్చుకుని దుర్వినియోగానికి పాల్పడి అపహాస్యం చేస్తోంది’ అని ధ్వజమెత్తారు.
“మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశం వల్ల ఈ కౌన్సిల్ సమయం వృధా కావడం దురదృష్టకరం. పాకిస్థాన్ కపటత్వం, అమానవీయ చర్యలతో అసమర్థ పాలనను కొనసాగిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంటే ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవాన్ని కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టి సారిస్తుంది” అని స్పష్టం చేశారు.
“మా నుంచి పాకిస్థాన్ ఈ విలువలు నేర్చుకోవాలి. మాపై ఆరోపణలు మాని.. మీ దేశంలోని ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలి’ అని ఆయన హితవు చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్లు ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే అని త్యాగి స్పష్టం చేశారు.
దశాబ్దాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ రెండు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం.. భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదంటూ చురకలంటించారు.
More Stories
పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం
అఫ్గానిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్