కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు సభ్యురాలైన కొద్దీ రోజులకే వివాదాలలో చిక్కుకుంటున్నారు. సోమవారంనాడు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఒక అందమైన బ్యాగుతో ప్రియాంక వచ్చారు. దానిపై ‘పాలస్తీనా’ అనే రాతలు ఉండటం, ఆ ఫోటోను కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షామ మహమ్మద్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.
దయ, న్యాయనిబద్ధత, మానవత్యానికి ఇది సంకేతమని, జెనీవా కన్వెన్షన్ను ఎవరూ ఉల్లంఘించరాదనే సందేశం ఇందులో ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఇది ముస్లింలను బుజ్జగించే చర్యగా బీజేపీ ఘాటు విమర్శలు గుప్పించింది.

More Stories
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా అనుపిందర్ సింగ్ గ్రేవాల్
టూరిస్ట్ వీసాపై వచ్చిన ముగ్గురు మతబోధకులపై వేటు!
బెంగాల్ లో బీజేపీకి మెజారిటీ, టీఎంసీ పతనం .. పలు ఎగ్జిట్ పోల్స్