
ఒక్క 2021 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలమంది నీటిలో మునిగి చనిపోయినట్లు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్) నివేదిక తెలిపింది. ఈ లెక్కల్నిబట్టి చూస్తే బహుశా ప్రతి గంటకు 30 మంది నీటి ప్రమాదాల వల్ల చనిపోయారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేసింది. ప్రత్యేకించి తక్కువ ఆదాయం, మధ్యస్థ ఆదాయం గల దేశాల్లో ఈ ప్రమాదాలు 92 శాతం సంభవించాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఇక 2021లో సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో (భారత్తో సహా) 83 వేల మరణాలు సంభవించాయి. ఇవి మొత్తం మరణాల శాతంలో 28 శాతంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. జెనీవాలో జరిగిన సమావేశంలో డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయసస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నివేదికపై మాట్లాడారు.
నీటి ప్రమాదాలపై దేశాలు అవగాహన పెంచుకోవడానికి, నివారణ వ్యూహాలకు సంబంధించి మార్గనిర్దేశం చేయడానికి, నీటి ప్రమాదాల కేసుల్ని ట్రాక్ చేయడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని ఆంధోమ్ తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా భారత్తో సహా 139 దేశాల్లో నీటి ప్రమాదాలతో చనిపోయేవారి శాతం 38 శాతం తగ్గింది.
2000 కంటే 2021లో అంటే గడచిన ఇరవై ఏళ్లలో ఈ మరణాల నివారింపులో పురోగతి ఉన్నప్పటికీ, వివిధ దేశాల మధ్య అసమానత ఉంది. యూరోపియన్ దేశాల్లో ఈ ప్రమాదాల్లో మరణించే వారి శాతం 68 శాతం, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో 48 శాతం తగ్గినట్టు నివేదిక తెలిపింది.
ముఖ్యంగా చిన్నారులు, యువతే ఈ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మరణాల శాతం దాదాపు 24 శాతం ఉంది. ఇక 5-14 సంవత్సరాల మధ్య వయసులో గలవారు 19 శతం, టీనేజ్ అండ్ యూత్ 15-29 మధ్య వయసుగలవారు 14 శాతంగా ఉంది.
భారత్లో 26 శాతం (30-44 మధ్య వయసు), 25 శాతం (18-29 వయసు), 17 శాతం (45-59 వయసు), 12 శాతం (0-13 వయసు), 10 శాతం (14-17), 10 శాతం (60 ఏళ్లకు పైబడినవారు)గా ఉంది. ఈ ప్రమాదాలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మరింత మంది చనిపోయే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.
2050 నాటికి 7.2 మిలియన్ల కంటే ఎక్కువమంది నీటి ప్రమాదాల్లో చనిపోయే అవకాశం ఉందని, ఈ ప్రమాదాల్లో ప్రధానంగా చిన్నారులే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ నివేదిక తెలిపింది.
బహుశా భవిష్యత్తులో నీటికుంటలు, బోరుబావులు, పర్యాటక ప్రాంతాల్లో సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వాలు తగినంత దృష్టి పెట్టాలని, ప్రమాదాల నివారణ కోసం తగినంత నిధులు కేటాయించాలని డబ్ల్యుహెచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే వాటికోసం పెట్టుబడి పెట్టకపోతే సైలంట్ కిల్లర్గా ప్రాణాల్ని తోడేస్తుందని డబ్ల్యుహెచ్ హెచ్చరించింది.
More Stories
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
హంగేరియన్ రచయితకు సాహిత్య నోబెల్