
‘ఎమర్జెన్సీ మార్షల్లా’ ప్రకటనతో చిక్కుల్లో పడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్కు పదవీ గండం తప్పింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినా అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధికార పీపుల్ పవర్’ పార్టీకి చెందిన సభ్యులు ఓటింగ్ను బహిష్కరించటం వల్ల అంభిశంసన తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటనతో చిక్కుల్లో పడిన ఆయనపై విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల మెజారిటీ ఉండాలి. అంటే నేషనల్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు 192 సీట్లు ఉండగా, అధికార పార్టీకి చెందిన ముగ్గురు చట్టసభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు.
ఓట్ల సంఖ్య 200కి చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దయ్యింది. ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటన విషయంలో యూన్పై సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చినప్పటికీ, అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లిపోతుందన్న కారణంతో ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అధ్యక్షుడు ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓటింగ్ కు కొద్దిసేపు ముందు యూన్ ఓ టెలివిజన్ ఛానల్లో మాట్లాడుతూ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని వెల్లడించారు. “ఆ ప్రకటన కోసం నా రాజకీయ, చట్టపరమైన బాధ్యతను తప్పించుకోలేను. మార్షల్ లా కారణంగా ప్రజలను ఆందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురి చేసినందుకు గాను క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇంకోసారి ఎమర్జెన్సీ విధించే ప్రయత్నం చేయబోనని హామీ ఇస్తున్నా” అని అధ్యక్షుడు యూన్ వెల్లడించారు.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, యూన్ సుక్ యోల్ ఇటీవల ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. చేసేదేం లేక వెనక్కి తగ్గిన అధ్యక్షుడు తన ప్రకటనను విరమించుకున్నట్టు తెలిపారు.
ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోవాలని, పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంట్లో ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. దక్షిణ కొరియా పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించింది.
More Stories
పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మెర్ 8,9 తేదీల్లో భారత పర్యటన
‘సామాజిక భద్రతలో విశిష్ట కృషి’కి ఐఎస్ఎస్ఏ పురస్కారం-2025