
శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్గఢ్ నక్సల్స్ బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. హింసను వీడాలని నక్సల్స్ను వేడుకుంటున్నానని, ఆయుధాలను విడిచిపెట్టాలని, ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించిన తరహాలో నక్సల్స్ లొంగిపోవాలని, ఒకవేళ మీరు వినకుంటే, అప్పుడు నక్సల్ నిర్మూలన చర్యలు చేపడుతామని షా పేర్కొన్నారు.
మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్లలో.. భద్రతా దళాలు ప్రగతిని సాధించాయని తెలిపారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితం అయినట్లు ఆయన వెల్లడించారు. ‘దేశంలో నక్సల్ హింస, సిద్ధాంతాలను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కేవలం నాలుగు జిల్లాకే పరిమితమైంది. మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయి’ అని తెలిపారు.
`నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్ గతంలో నిర్ణయించారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ఎత్తులను చిత్తు చేసింది. ఛత్తీస్గఢ్లో నక్సల్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది. దీని ద్వారా ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తాం’ అని అమిత్ షా భరోసా ఇచ్చారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’