ఏలూరు జిల్లా కేంద్రంలోని అమీనాపేటలో శ్రీ స్వామి సరస్వతి సేవా ఆశ్రమం పేరుతో బాలిక వసతి గృహం ఉంది. ఇందులో 50 మంది బాలికలు వసతి పొందుతూ వేర్వేరు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు హాస్టల్ నిర్వహణను పట్టించుకోక పోవడంతో ఏలూరుకి చెందిన శశికుమార్ దానిని చేజిక్కించుకున్నాడు.
శశికుమార్ చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెగా పనిచేస్తున్నాడు. అమీనాపేటలో ఉన్న వసతి గృహానికి వార్డెన్గా తన రెండో భార్య మణిశ్రీని, విద్యార్థినుల సంరక్షకురాలిగా మేనకోడలు లావణ్యని నియమించాడు. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని ఫొటోషూట్ పేరుతో మాయ మాటలు చెప్పి లోబర్చుకునేవాడు.
ఈ క్రమంలో ఫొటోషూట్ అంటూ ఈనెల 15 ఆదివారం ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడని, అక్కడ ఆమెపై అత్యాచారం చేసి 16వ తేదీ సోమవారం రాత్రి తిరిగి తీసుకొచ్చి వసతిగృహంలో దింపేశాడు. రాత్రి సమయంలో ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా మిగిలిన బాలికలు ప్రశ్నించారు.
దీంతో జరిగిన దారుణాన్ని ఆమె వారికి చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు విషయం చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరనీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు.
వార్డెన్ ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ బాలికల వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితుడు, ఆయనకు సహకరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు శశికుమార్ పరారీలో ఉన్నాడు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం