ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులపై సీరియస్ కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ అధికారి స్రవంతి రాయ్ డిజిపికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే హీరోయిన్ జత్వానీపై కేసు పెట్టి కుటుంబం మొత్తాన్ని విజయవాడకు తీసుకు వచ్చేలా పధకం వేసిన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.
హీరోయిన్ జెత్వానపై వైసిపి నాయకుడు కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టిన రోజు సాయంత్రమే ముంబైకి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. అయితే వారు అలా వెళ్లడానికి అవసరమైన విమానం టిక్కెట్లను ముందు రోజే బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టడానికి ముందే ముంబైకి వెళ్లేందుకు పోలీసు బృందం టిక్కెట్లు బుక్ అయ్యాయి.
ప్లాన్ ప్రకారమే ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ తో తప్పుడు ఫిర్యాదు తీసుకుని హీరోయిన్ జెత్వానీ కటుంబాన్ని తీసకొచ్చేందుకు ప్రయత్నించారని, దానికి ముందుగానే టిక్కెట్లు తీసుకున్న వైనమే అసలైన సాక్ష్యమని అంటున్నారు. అదే సమయంలో జెత్వానీ తమకు కుక్కల విద్యాసాగర్కు చెందిన భూమి అమ్మకానికి పెట్టిందని రూ. 5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకుందని, పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తులు కూడా ఇప్పుడు అడ్డం తిరిగారు.
తమకు అసలు జెత్వానీన తెలియదని, ఆమె తమకు భూమి అమ్మజూపలేదని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనం కోసం టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి కుక్కల విద్యాసాగర్ తమ ఆధార్ కార్డులు తీసుకుని దుర్వినియోగం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేసు పెట్టడానికి ఉపయోగిచిన డాక్యుమెంట్లు జెత్వానీవి కావని, వాటిని పోలీసులే తయారు చేశారన్న ఆరోపణలపైనా విచారణ అధికారి నివేదికలో స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో తనను ముగ్గురు ఐపిఎస్ అధికారులు వేధించారని జెత్వానీ ఫిర్యాదు చేశారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయలు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డిసిపి విసాల్ గున్నీ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
విశాల్ గున్ని నేతృత్వంలో ముంబైకి వెళ్లిన పోలీసు బృందంలో చాలా మంది అప్పుడేం జరిగిందో పూర్తిగా పోలీసులకు వివరించారు. తాము ఉన్నతాధికారులు చెప్పిందే చేశామని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఆ పోలీసులు చెప్పిన దాంట్లోనూ సంచలన విషయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ జెత్వానీ కేసులో దేశం మొత్తం ఆశ్చర్యపోయే సంచలన విషయాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరోవంక, నటి కాదంబరీ జిత్వానీ శుక్రవారం విజయవాడకు చేరుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పలువురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని సీఐ చంద్రశేఖర్కు అందజేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్లు లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ తనను మానసికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విద్యాసాగర్ సహా ఐపీఎస్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ