హైదరాబాద్‌లో హత్యలు పెరిగాయని అసత్య ప్రచారం

హైదరాబాద్‌లో హత్యలు పెరిగాయని అసత్య ప్రచారం
తెలంగాణలోని హైదరాబాద్‌లో క్రైమ్ రేట్‌ పెరిగిందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీ జితేందర్ విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది జులై వరకు హైదరాబాద్ లో 48 హత్యలు జరిగాయని, ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు 48 హత్యలే జరిగాయన చెబుతూ అలాంటప్పుడు హత్యలు పెరిగాయని ఎలా ప్రచారం చేస్తారని అయన ప్రశ్నించారు.

సంగారెడ్డి జిల్లాలో తన పర్యటన సందర్బంగా, జిల్లా పోలీసులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన డిజిపి, తదనంతరం మీడియా తో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల ఆరోపణల పైన స్పందించారు. కొందరు కావాలనే పోలీసుల పైన నిందలు వేయటానికి ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నారని అయన తెలిపారు. వారు దృష్ప్రచారం చేయటానికి కారణాలు ఏంటి అనే విషయాలు జోలికి తాను వెళ్లానని చెప్పా.

సంగారెడ్డి జిల్లాకు కర్ణాటక బోర్డర్లో ఉండటంతో, తెలంగాణ నుండి కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్తున్న, అక్కడ నుండి తెలంగాణ లోకి వస్తున్నా అన్ని వాహనాలను  పూర్తిగా చెక్ చేయాలనీ. ఎలాంటి వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన పోలీసులను ఆదేశించారు. ప్రయాణికులు ఉన్న వాహనాలను తనిఖీ చేసేటప్పుడు వారికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను అయన కోరారు.

సంగారెడ్డి జిల్లలో గంజాయి రవాణా, అమ్మకాలు, గంజాయి చెట్ల అమ్మకాలని అరికట్టడంపై పూర్తి దృష్టి పెట్టాలని కోరారు. మట్కా, పేకాట లాంటి జూదం ఆడే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ పొలిసు అధికారులని కోరారు. ఈ సందర్బంగా, సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లాలో పోలీసుల పని తీరు పెంచడానికి చేపట్టిన వివిధ చర్యలు వివరించారు. 

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు చాల బాగా పనిచేస్తున్నారు డిజిపి ఈ సందర్బంగా వారిని కొనియాడారు. నేరస్తులకు కోర్టులో శిక్ష పడినప్పుడే, నేరస్తులు తిరిగి నేరం చేయడానికి భయపడతారని, అదేవిధంగా ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. 

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలు ఉన్నట్లయితే ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సత్సంబంధాలు కలిగినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని డిజిపి గుర్తు చేశారు.