కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేట్

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేట్
* మంత్రులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్ 19 వ గేటు కొట్టుకుపోయింది. గత కొద్ది రోజులుగా జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చైన్ లింక్ తెగిపోవటంతో డ్యాం గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ గేట్ నుంచి 40వేల క్యూ సెక్కుల నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నదిలో భారీగా వరద ఉంది.

జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి. మొత్తంగా లక్ష క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తోందని కర్నూలు – మహబూబ్ నగర్ జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్​లతో మాట్లాడారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి కేశవ్​ను సీఎం ఆదేశించారు.  తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని కేశవ్ వెల్లడించారు. టీబీ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడంవల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోయిన వెంటనే రాష్ట్రంలోని ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి కేశవ్ తెలిపారు. తెల్లవారుజామున గేటు కొట్టుకుపోవడం, ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతుందని చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర డ్యామ్ గుండెకాయలాంటిదని, . దీని నమ్ముకుని లక్షలాదిమంది రైతులు పంటలు వేశారని పేర్కొంటూ నీరు వృథాగా పోకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు..

తుంగభద్ర ఆనకట్ట 19వ క్రస్ట్ గేట్ చైన్‌లింక్ తెగిపోవడంపై కర్ణాటక రాష్ట్రం, కొప్పాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్‌  గేటు ద్వారా 35 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని వెల్లడించారు. గేటు మరమ్మతు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలిపారు. జలాశయంలోని 65 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని, దాదాపు 65 టీఎంసీల నీటిని ఖాళీ చేయడం తప్ప రిజర్వాయర్‌ భద్రతకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని తెలిపారు.  ప్రస్తుతం అన్ని గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 20 అడుగుల నీరు ఖాళీ అయితే తప్ప గేటు పరిస్థితి ఏమిటో చెప్పలేమన్నారు.