
మరోసారి నిపా కేసులు వెలుగు చూడడంతో ప్రోటోకాల్ అమలులోకి తీసుకువచ్చింది. ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి మలప్పురం, కోజిక్కోడ్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది, జనం మాస్క్లు ధరించేలా చూడాలని చెప్పారు.
గతేడాది సెప్టెంబర్లో కేరళలో నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. కేరళలోని కోజికోడ్లో ప్రభావం ఎక్కువగా కనిపిచింది. కేరళలో వైరస్ విస్తరించే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేశారు. గత అక్టోబర్లో ఐసీఎంఆర్ ఉత్తర కోజికోడ్ జిల్లాలోని మారుతోంకరా నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిపా వైరస్ యాంటీబాడీస్ ఉన్నట్లు నిర్ధారించింది.
నిపా వైరస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. వైరస్ సోకిన వారిలో మొదట్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. నిపా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, మెదడుపై దాడి చేస్తుంది.
లక్షణాల్లో దగ్గు, గొంతునొప్పి నుంచి వేగంగా శ్వాస తీసుకోవడం, జ్వరం, వికారం, వాంతులు, జీర్ణాశయాంతర సమస్యలు కనిపిస్తాయి. ఈ వైరస్ మెదడువాపునకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లడంతో పాటు మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్