స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఛైర్మన్గా శ్రీవాసులు శెట్టి నియామకం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐ ఛైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని కొనియాడారు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతనంగా నియమితులైన ఛైర్మన్కి తెలంగాణ రాష్ట్రం తరపున రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శ్రీనివాసులు తన కొత్త పాత్రలో అనేక విజయాలు, ప్రశంసలతో పాటు పదవీకాలం కొనసాగాలని సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ ఎంతో గర్వ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీనివాసులు శెట్టికి అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎస్బీఐ మరెన్నో మైలురాళ్లు అందుకోవాలని పవన్ ఆకాంక్షించారు.
క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన శ్రీనివాసులు శెట్టి, ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని ఆకాంక్షించారు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన ఛైర్మన్గా నియమితులవుతున్న తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టికి హార్ధిక శుభాకాంక్షలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
More Stories
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి విన్నవించాం
ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోమని ప్రధానిని కోరిన చంద్రబాబు