![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Electronic-goods-1024x512.webp)
ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడే వారంటీకి సంబంధించిన పూర్తి వివరాలను వినియోగదారులకు స్పష్టంగా చెప్పాలని కేంద్రం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలకు స్పష్టం చేసింది. వారంటీ వ్యవధి ప్రారంభ తేదీని యూజర్లకు తెలియజేయాలని, వారంటీ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను భారత్లో అనుసరించాలని తయారీ సంస్థలను కేంద్రం కోరింది.
వస్తువును కొనుగోలు చేయడానికి ముందే దానికి సంబంధించిన వారంటీ వివరాలు తెలియజేయాలని, వస్తువు కొన్న తరువాత చెప్పవద్దని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సిసిపిఎ) శనివారం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయింది. తయారీ సంస్థలు రూపొందించిన విధానాల ప్రకారం,
వారంటీ వ్యవధి వస్తువు కొనుగోలు చేసిన తేదీ నుంచి ప్రారంభం అవుతుందని, ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్ తేదీ నుంచి కాదని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారులు వస్తువును ఇన్స్టాల్ చేసుకున్న తరువాతే వారంటీ మొదలవుతుందని కేంద్రం తెలిపింది.
వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత, పరిమాణం, పనితీరు, ప్రమాణాలు, నాణ్యత, ధరల గురించి తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని కేంద్రం తెలిపింది, అన్ని సంస్థలు తమ అభిప్రాయాలను 15 రోజుల లోగా తెలియజేయాలని కేంద్రం కోరింది. వారంటీ వ్యవధికి సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులను సత్వరం, చురుకుగా పరిష్కరించాలని సిసిపిఎ చీఫ్ కమిషనర్ నిధి ఖరే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎల్జి, పానాసోనిక్; హాయర్, క్రోమా, బాష్ కంపెనీలతో పాటు పలు ప్రధాన ఎలక్ట్రానిక్స్ వస్తువుల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
More Stories
కేరళలో సీపీఎంపై హవాలా లావాదేవీ ఆరోపణలు
జూలై 1 నుంచి మహారాష్ట్రలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో తగ్గుముఖం పడుతున్న గృహ విక్రయాలు