
కాగా, రిటర్నింగ్ అధికారిణి వందనా సూర్యవంశీ ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ అవసరం లేదని తెలిపారు. ‘ఇది (ఈవీఎం) సాంకేతికంగా ఫూల్ప్రూఫ్ స్వతంత్ర పరికరం. వైర్లెస్ లేదా వైరు కమ్యూనికేషన్ పరికరం కాదు. అన్లాక్ చేయడానికి మొబైల్ ఫోన్ అవసరం లేదు. ఈవీఎంకు ఓటీపీ అవసరం లేదు. ఒక బటన్ నొక్కడం ద్వారా ఫలితాలు వస్తాయి’ అని ఆమె పేర్కొన్నారు.
కౌంటింగ్ చేయడానికి ఓటీపీ అవసరం లేదని, డాటా ఎంట్రీ చేయడానికి మాత్రం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కు ఓటీపీ వస్తుందని తెలిపారు.జోగేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటా ఎంట్రీ ఆపరేటర్ దినేశ్ గురవ్ వ్యక్తిగత ఫోన్ మాత్రం ఒక అనధికార వ్యక్తి దగ్గర లభించిందని పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వార్తను జతచేసి సోషల్ మీడియా వేదికగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు.
మరోవైపు ఈవీఎం హ్యాకింగ్ గురించి ఒక వార్తాపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచారం చేసిందని ఎన్నికల అధికారిణి వందనా ఆరోపించారు. అబద్ధవు కథనాలను సృష్టించడానికి కొందరు నాయకులు దీనిని వినియోగిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తప్పుడు వార్త వ్యాప్తి చేసి పరువు నష్టం కలిగించిన ముంబై వార్తాపత్రికకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసు జారీ చేసిందని ఆమె వెల్లడించారు.
More Stories
ఎవరెస్ట్పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్లో కర్ఫ్యూ
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం