
* హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్
ఒడిశాలో మోహన్ చరణ మాఝి నేతృత్వంలో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం ఉదయం పూరీలోని జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరిపించింది. అనంతరం సీఎం మోహన్ చరణ మాఝితోపాటు కేబినెట్ మంత్రులంతా జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో ఆలయ నాలుగు ద్వారాలను ఐదేళ్ల తర్వాత అధికారులు తెరిచారు. అన్ని ద్వారాల గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆలయ నాలుగు ద్వారాలు తెరవడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ముఖ్యమంత్రి మెహన్ చరణ నిర్ణయాన్ని భక్తులతోపాటు ఆలయ సేవకులు స్వాగతించారు.
2020 మార్చిలో కరోనా ఆంక్షలతో అప్పటి బీజేడీ ప్రభుత్వం 12వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ద్వారాలను మూసివేసింది. కేవలం సింహద్వారం నుంచే భక్తులను అనుమతించింది. కరోనా మహమ్మారి విజృంభన ముందుకు వరకు ఆలయంలోని నాలుగు ద్వారా నుంచి భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది.
ఆ తర్వాత కరోనా ఆంక్షలు ఎత్తివేసినా ద్వారాలను తెరవలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చినా బీజేడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా తీసుకుని ప్రచారం చేసింది
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం