
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా ఉన్నారు.
44 ఏండ్ల పెమా ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి, మాజీ సీఎం దోర్జీ ఖండ్ మరణంతో రాజకీయాల్లో ప్రవేశించారు. తన తండ్రి స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీపై తిరుగుబాటు చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు.
దీంతో మెజార్టీ కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండూ బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మళ్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అరుణాచల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులు?
ఛత్తీస్గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి క్లీన్ స్వీప్