![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Charminar-BJP-1024x576.jpg)
1.ఆదిలాబాద్(ఎదులాపురం)గా 2. నిజామాబాద్ (ఇందూరు)గా 3.జహీరాబాద్ (పెద్దెక్కిలి)గా 4..కరీంనగర్ (ఎలగందల)గా 5.సికింద్రాబాద్ (లష్కర్ లేదా ఉల్వులు) గా 6. మహబూబ్ నగర్ (పాలమూరు) గా. 7. మహబూబాబాద్ (మానుకోట)గా పేర్లు ఇంకా స్ధానికులు వాడుతున్నారని గుర్తు చేశారు. వాటిని కాంగ్రెస్ సర్కారు అధికారికంగా పునరుద్దరించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేయాలని బిజెపి నేత సూచించారు.
ఇక రాచరికపు గుర్తులను రాష్ట్ర చిహ్నంలోనే కాకుండా అసలు రాచరికపు ఆనవాళ్లను ప్రత్యేకించి తెలంగాణ హిందువుల రక్త మాంసాలతో, ఆడబిడ్డల మానాభిమానాలతో ఆటలాడుకుని, క్రూరంగా హింసించి, నిరంకుశ పాలన సాగించిన ముస్లిం పాలకుల గుర్తులను, ఆనవాళ్లను తెలంగాణ నుంచి లేకుండా చేయాలనేది బిజెపి డిమాండ్ అని ఆయన తెలిపారు. మరి ముస్లిం ఓట్ల కోసం పాకులాడే రేవంత్ రెడ్డికి ముస్లిం పాలకుల గుర్తయిన చార్మినార్ ను తొలగించే దమ్ము, ధైర్యముందా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
నిజంగా రాచరికపు గుర్తులను తొలగించాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే ఉంటే తెలంగాణ నుంచి దురాక్రమణ దారులైన ముస్లిం పాలకుల ఆనవాళ్లు లేకుండా చేయాలి కానీ, ప్రజల ఆదరణ పొందిన కాకతీయుల వంటి హిందూ పాలకుల గుర్తులను తొలగించడం సరికాదని ఆయన హితవు చెప్పారు.
ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, వారి తల్లి లేదా తండ్రి లేదా భార్యకు ప్రతినెలా రూ. 25 వేలు అమరవీరుల గౌరవ పెన్షన్, ఇళ్ల స్థలాలు అందజేస్తామన్న హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీనీ ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేతలను విస్మరించడం సరికాదని మండిపడ్డారు.
More Stories
యువమోర్చ కార్యకర్తలలపై లాఠీఛార్జ్ పట్ల ఆగ్రహం
ఆగస్టు 11న నీట్ -పిజి పరీక్షలు
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం