దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి గెలుపు ప్రస్తుతం మన దేశానికి అత్యంత ఆవసరమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు స్పష్టం చేశారు.18 ఏళ్లు నిండిన(18+) యువతకు ఓటు హక్కు మొదటి సారిగా వినియోగించుకునే దిశలో ‘సంచారి’ స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ‘భవిష్య భారత్ ‘ శీర్షికన గత కొన్ని నెలలుగా ఓటర్ల ను జాగృతి పరిచే కార్యక్రమాలు చేపట్టింది.
ఇందులో భాగంగా గురువారం సుళ్ళూరుపేట సరిహద్దు గ్రామాలైన వట్టంబేడు కుప్పం, తడ, కొత్త కుప్పం ,సెల్వి కుప్పం నుండి వచ్చిన మత్స్యకార వయోజన విద్యార్థులతో నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో `సంచారి’ వ్యవస్థాపకులు డాక్టర్ దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు (పూనా ఒప్పందం) ఓటింగ్ హక్కులలో నెలకొన్న వివక్షతను వివరిస్తూ, భారత రాజ్యాంగం అమలు దిశలో డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రతి వయోజనుడు ఓటు హక్కు పొందే విధంగా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడం దేశ సమగ్రతకు సౌభ్రాతృత్వానికి చిహ్నమని పేర్కొన్నారు. ఇందుకు యువత దోహదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి నిర్వహణలో జరిగింది. జాతీయ మత్స్యకార అభివృద్ధి మండలి సభ్యులు పోలయ్య కొలంగారి, మత్స్య కార జిల్లా నాయకులు పాల్గొన్నారు. స్థానిక యువత సహకారంతో సంచారీ సంస్థ గత సంవత్సర కాలంగా దాదాపు 27 వేల మంది కొత్త ఓటర్ల నమోదు లక్ష్యం సాధించిందని వివరించారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్య కారులు, యానాదులు, సంచార జాతుల సమూహాలను గుర్తించి ప్రత్యేకంగా దృష్టి సారించి అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించినట్లు వెల్లడించారు.
తాము చేస్తున్న ప్రయత్నం తో పాటు ప్రభుత్వం ఎన్నికల సంఘం ఓటుపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటింగ్ విషయ పరిజ్ఞానం కల్పించే దిశగా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ప్రత్యేకించి 28 ఏప్రిల్ నుండి 10 మే 2024 వరకూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వర్గాలు నివాసం ఉంటున్న గ్రామాల్లో వారి వారి కాలనీల్లో 10 మంది 18+ ఓటర్లు ఉండేటట్టు ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించటం జరుగుతుంది. ఒక రోజు తీర ప్రాంత మత్స్యకార కుప్పాలలో, మరుసటి రోజు యానాది గిరిజన ప్రాంతాల్లో, ఆ మరుసటి రోజు సంచార జాతులతో క్రమం తప్పకుండా ముఖాముఖి సమావేశాలు జరిగే విధంగా స్పెషల్ డ్రైవులు చేపట్టటం ప్రత్యేకత.
ప్రసంగాలకు తావు లేకుండా భాగస్వామ్యం మోడ్ లో యువతను ఆకట్టుకోవడం ఆసక్తి కరం. పొద్దున్నే ఒక సెషన్, సాయంత్రం రెండో సెషన్ స్థానికులకు అనుకూలంగా ఉండేటట్లుగా టైం టేబుల్ తయారు చేసి ముందుగానే ఓటర్లకు తెలియజేయడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి యువతీ యువకుడు తమ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చె విధంగా ప్రతి సెషన్ రెండు గoటలు మించకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
స్థానిక కుల సంఘ నాయకుల సహకారంతో, ఆయా ప్రాంతాల్లో చురుకుగా పని చేస్తున్న సేవా సంస్థల సహాయంతో, విద్యార్థి నాయకులను సమ్మిళతం చేసి అర్థవంతంగా నిర్వహించటం ప్రత్యేకత. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం రూపొందించిన ‘గైడ్ టు ఓటర్స్’ సంభందిత ప్రింట్ మెటీరియల్ మరియు కరపత్రాలు యువత కు అందజేయటం కూడా జరుగుతుంది ఈ దిశగా.
యువతే దేశ భవిష్యత్తు వారి ఆలోచనలే ఆచరణీయాలు…సంకల్ప భారత్-సమృద్ధి భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఈ పర్యటనలో భాగం.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్