
తెలంగాణలో బీజేపీ తొలి బోణీ కొట్టింది. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి శ్రీహరి రావుపై విజయం సాధించారు.బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి సుమారు 16వేల ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఇదిలా ఉండగా దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ చేజార్చుకుంది. రఘునందన్ రావు ఓటమి చవిచూశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
More Stories
సాహితీ ఇన్ ఫ్రా కేసులో జగపతిబాబును విచారించిన ఈడీ
కీలక దశకు ఫార్ములా ఈ-రేసు కేసు
హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో 4 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే