ఈ క్రమంలో ఇవాళే ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్భూషణ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ మహిళా మహాపంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
నిరసన చేస్తున్న రెజ్లర్లు పోలీస్ బారికెడ్లపై నుంచి దూకి నూతన పార్లమెంటు భవనం వైపుకు పోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని ఆపేశారు. పోలీసులను భారీ సంఖ్యలోనే మోహరించి ఉంచడంతో రెజ్లర్లు ముందుకు పోలేకపోయారు.
ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు.
More Stories
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు
చార్ధామ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి