రూ. 85 వేల కోట్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు

రూ. 85 వేల కోట్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు

దేశంలో తయారై ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మొబైల్ ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా సెల్యూలర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)శనివారం వెల్లడించిన డేటా ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతయ్యాయి.  ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) స్కీమ్‌ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఎగుమతులతో పోలిస్తే భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.

31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొబైల్ రికార్డు స్థాయిలో ఎగుమతి అయ్యాయి. కాగా భారత్ నుంచి మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్న  దేశాల్లో యూఎఇ, యూఎస్, నెదర్లాండ్స్, యూకె, ఇటలీ తొలి ఐదు స్థానాల్లో ఉన్నట్లు ఐసిఇఎ డేటా వెల్లడించింది. చైనా నుంచి స్మార్ట్‌ఫోన్ తయారీ పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోవడంతో భారత్, వియత్నాం భారీ లబ్ధిదారులుగా కాగా భారత్ విక్రయిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో 97 శాతంకు పైగా స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయి. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారుదారుగా ఉంది.

ఎఫ్‌వై 23లో భారత్ మొబైల్ ఫోన్ల ఎగుమతిలో రూ.85,000కోట్ల మార్కును అధిగమించిందని ఐసిఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. చైనా నుంచి ఐఫోన్ల తయారీని వియత్నాం, భారత్ లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి 40 బిలియన్‌ డాలర్లకు మించిపోయిందని, ఇందులో 25 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని మోహింద్రో చెప్పారు.

కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఏడాది భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి లక్ష కోట్ల రూపాయలుకు చేరుకోవాలనేది లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. 2022లో 80-85 శాతం ఐఫోన్లను చైనా ఉత్పత్తి చేసింది. 2027 నాటికి భారత్ నుంచి 45-50 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 చివరి నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో ఇండియా 10-15 శాతం వాటా కలిగి ఉంది.