గత నెలలో ముంబై – షిర్డీ, ముంబై – సోలాపూర్ మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మొదలయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గింది. ఇదే విధంగా ముంబై-గోవా మధ్య కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకతో ప్రయాణ సమయం తగ్గుతుందని మంత్రి చెప్పారని నిరంజన్ వెల్లడించారు.
ముంబై-గోవా రైల్వే రూట్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిందని, ఇన్స్పెక్షన్ తర్వాత కొత్త ట్రైన్ సర్వీస్ మొదలవుతుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బృందంతో కేంద్ర మంత్రి దన్వే చెప్పారు. థానే, కొంకణ్ పరిధిలో రైల్వే సంబంధిత సమస్యల గురించి చర్చించేందుకు శాసనసభ, మండలి ప్రతినిధులు.. మంత్రితో సమావేశమయ్యారు.
రైల్వే ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమయ్యే వారికి స్టాళ్ల కేటాయింపు, ప్రతీ రైల్వే స్టేషన్లో రైతులకు మొబైల్ స్టాల్స్ కేటాయింపు, ప్లాట్పామ్ల ఎత్తు పెంపు, రైల్వే వంతెనలు వరద ముంపునకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చలు జరిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. గత నెలలో ముంబై – సోలాపూర్, ముంబై – షిర్డీ మధ్య రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది.
దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. వేగంతో పాటు మంచి సదుపాయాలు ఉండడంతో ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ టికెట్ ధరలు కాస్త అధికంగానే ఉన్నా వేగం, సమయపాలన విషయంలో మెరుగ్గా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
More Stories
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
ఐటీ రంగంలో కొత్త నియామకాలపై నీలినీడలు