
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాగ్పూర్ లో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. స్పిన్నర్ల ధాటికి ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాపై 223 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177 ఆలౌట్ అయింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. భారత్ స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే చతికిలపడింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించారు.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 321/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు మరో 79 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 177 పరుగులు చేసింది.
దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 233 పరుగుల ఆధిక్యం లభించింది. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ (120) శతకంతో మెరవగా.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(70), అక్షర్ పటేల్ (84) రాణించారు. చివరలో మహ్మద్ షమీ 37 పరుగులతో బ్యాట్ ఝులిపించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లు తీస్తే.. సారథి ప్యాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఒక వికెట్ పడగొట్టారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు