స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. అనంతరం గోషా మహల్ కు తరలించారు. బీజేపీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రగతి భవన్కు కిలోమీటర్ దూరం వరకు పోలీసులను మోహరించారు.
13 జిల్లాల్లో స్పౌజ్ టీచర్ల బదిలీలను బ్లాక్ చేయడంపై టీచర్లు ఆందోళనకు దిగారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు ముందే తమను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పని చేయడం వల్ల తమతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
అయితే మూడునాలుగు రోజులుగా టీచర్లు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడుతోంది. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.ప్రగతి భవన్ వద్ద మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషాసహా మోర్చా నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు.ప్రగతి భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ సహా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మత ప్రాతిపాదక రిజర్వేషన్లు
సెక్స్ రాకెట్ లో ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణపై వేటుకు సిద్ధం!
కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ