ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ మోడీ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు. రజతం, కాంస్య పతకాలు ఎవరికి వస్తాయో తాను ఆందోళన చెందడం లేదని..పరోక్షంగా కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ తన గురువుగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాహుల్ గాంధీ నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని ఆయన హితవు చెప్పారు.
బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు’అనే విషయాన్ని బీజేపీని చూసి నేర్చుకున్నట్లు చెప్పారు. తన భవిష్యత్ కు ఒక రోడ్ మ్యాప్ ను కూడా బీజేపీయే చూపిస్తోందని రాహుల్ సెటైర్ వేశారు.
“బీజేపీ వాళ్లు కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నా…దాని వల్ల కాంగ్రెస్ పార్టీ తమ సైద్ధాంతికతను, భావజాలాన్ని గ్రహించేందుకు ఆస్కారం కలుగుతుంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు