
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంతారా చిత్రాన్ని వీక్షించి సినిమా ఫై ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బెంగళూరులో తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్ లో కాంతారా సినిమా చూసినట్లు వెల్లడించారు.
తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందని మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను చాలా బాగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్ చేశారు.
ఇక ఎలాంటి ప్రచారం లేకుండా కన్నడ లో విడుదలైన కాంతారా అక్కడ సూపర్ హిట్ తెచ్చుకొని , ఆ తర్వాత తెలుగు, హిందీ పలు భాషల్లో విడుదలైంది. కేవలం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు ..వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సినీ లవర్స్ చూడడం జరిగింది.
విడుదల వరకు అసలు ఎవరికీ తెలియని ఈ సినిమా.. విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనూహ్య విజయంతో ప్రాంతాలు, భాషలకు అతీతంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రిషబ్ శెట్టి నటన, అద్భుత దర్శకత్వంతో ఈ సినిమా విజయతీరాలను అందుకుంది.
ఈ సినిమాను చూడాలని సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం పోటీ పడుతున్నారు. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా