వచ్చే నెలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపేందుకు ప్రయత్నిస్తుందని, మళ్లీ కరెంట్ ఛార్జీలు భారీగా పెంచేందుకు కుట్ర చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటే బీజేపీ వ్యతిరేకించలేదని పేర్కొంటూ, ప్రజల్లో విష బీజాలు నాటేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని..ఉచితాల పేరుతో ప్రజలకు హామీలను ఇస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు కట్టలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. రూ 60 వేల కోట్లకుపైగా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని చెబుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందని తెలిపారు. డిస్కంలకు డబ్బులు చెల్లించకపోవడంతో ఉత్పత్తి సంస్థలు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కరెంట్ ను ఉత్పత్తి చేసే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు.
ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయితే దేశం మొత్తం అంధకారం అయ్యే పరిస్థితి వస్తుందని సంజయ్ హెచ్చరించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు రూ 17వేల కోట్లకుపైగా చెల్లించాలని తెలిపారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉచిత కరెంట్ వినియోగిస్తూ….సెప్టెంబర్ లో ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. పవర్ ఎక్సేంజ్ పేరుతో విద్యుత్ ను కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుందని చెబుతూ ఇలా చేస్తే ఏ రోజుకో ఆ రోజు ధర నిర్ణయిస్తారని చెప్పారు.
బకాయిలు సకాలంలో కట్టకపోవడంతో ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందని పేర్కొంఒక్క పథ బస్తీలోనే రూ 5 వేల కోట్లకుపైగా బిల్లులు కట్టాల్సి ఉందని తెలిపారు. ఇష్టం వచ్చినట్టు కరెంట్ కొనుగోళ్లు వద్దని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం చెప్పిందని సంజయ్ గుర్తు చేశారు.
డిస్కంలకు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం, అధికారులు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పే మాటలకు పొంతన లేదని విమర్శించారు. ఉచిత కరెంట్ ఇవ్వకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్ కో,ట్రాన్స్ కో లో 50 వేలకు మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని పేర్కొన్నారు.
ఒకటో తారీఖున రావాల్సిన జీతాలలు..10వ తేదీ వరకు రావడం లేదని చెప్పారు. గతంలో పెంచిన కరెంట్ ఛార్జీలతో రూ. 6 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మళ్లీ పెంచితే మరో రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు.

More Stories
విజయోత్సవాలు జరుపుకొనేందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి
బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల
వైఫల్యాలు దాచిపెట్టేందుకే రేవంత్ `రైసింగ్ తెలంగాణ’ సదస్సు