
గడువులోగా లక్ష్యాన్ని చేరుకోకుంటే మరికొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఇక జనవరి రెండో వారం తర్వాత రబీ దిగుబడుల కొనుగోలు మొదలై జూలై 31వరకు కొనసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, అటు రైతాంగాన్ని మోసం చేస్తూ.. ఇటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హుజూరాబాద్ ఫలితంను తట్టుకోలేక, ఆ పరాజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీర్ఆ శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చారిత్రక తీర్పును అంత త్వరగా మర్చిపోరని ఆయన స్పష్టం చేశారు. అందుకే ధాన్యం కొనుగోలు డ్రామాను తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. ‘నిజంగా రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదు’ అని స్పష్టంచేశారు.
‘హుజూరాబాద్లో బీజేపీ గెలుపు తర్వాత మా పార్టీపై కేసీఆర్ మరింత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా సభ్యత లేకుండా మాట్లాడడం సమంజసం కాదు. సాధారణ పౌరుడు మొదలు ప్రధానమంత్రి మోదీ వరకు అందర్నీ అడ్డగోలుగా విమర్శించడం అలవాటుగా మారింది’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది