
పాకిస్థాన్లోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కరక్ పట్టణంలో ఓ హిందూ దేవాలయాన్ని తగులబెట్టిన సంఘటనపై మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజరి కూడా ఖండించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు.
జిల్లా పోలీస్ అధికారి ఇర్ఫాన్ ఉల్లా మాట్లాడుతూ, ఈ దేవాలయం విధ్వంసానికి కారకులను అరెస్టు చేయాలని షిరీన్ మజరి కోరారని చెప్పారు. కొందరు నిందితులను తాము అరెస్టు చేశామన్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రాడికల్ జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్ పార్టీ నేతలు, స్థానికులు ఈ దేవాలయాన్ని తగులబెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక హిందువులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు అనుమతి తీసుకుని, పునరుద్దరణకు పనులు చేస్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు సమాచారం.
More Stories
రహస్య పత్రాల లీక్లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్
బలహీనపడిన అమెరికా పాస్పోర్ట్
యుద్ధం ముగిసింది.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం!