“సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానికి 67.5 ఎకరాలు ఉంది. కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు ఉంది. హరీశ్రావు కుటుంబానికి 30 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు ఉంది. జోగినపల్లి సంతోష్రావు కుటుంబానికి 79 ఎకరాలు ఉంది. నవీన్రావుకు 52 ఎకరాలు, కొండల్రావుకు 48 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాలోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాలున్నాయి” అని ముఖ్యమంత్రి వివరించారు.
మొత్తం రూ.లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూకుంభకోణంపై స్పెషల్ ఎంక్వయిరీ టీమ్ (ఎస్ఈటీ), మొత్తం భూకుంభకోణంపై నెలరోజుల్లో నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చెప్పింది ధరణి పార్ట్- 1 మాత్రమేనని, త్వరలోనే ధరణి పార్ట్-2 అక్రమాలు బయటపెడతామని వెల్లడిచారు.
సత్యం స్కాంలో ఉన్న భూముల్లోనే కేటీఆర్ ఫాంహౌస్ ఉందని పేర్కొంటూ సత్యం స్కాంలో ఉన్న భూములు కేటీఆర్ బంధువుల పేరుతో బదిలీ అయ్యాయని ఆరోపింఛారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్ రావు ఫాంహౌస్కు రోడ్లు వేయించినట్లు తెలిపారు. ఇరిగేషన్కు తీసుకున్న భూమిలోనే హరీశ్ రావు ఫాంహౌస్ ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాలానగర్లో 120 ఎకరాలను హరీశ్ రావు కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు భయపడుతున్నారని పేర్కొన్నారు.
కాగా, “మా ఆస్తులు, రేవంత్ రెడ్డి ఆస్తులు నీ తమ్ముళ్ల ఆస్తులు ఎట్ల పెరిగినయ్.అన్నింటి మీద సిట్టింగ్ జడ్జితో మేం ఎంక్వైరీకి సిద్దం. నువ్వు రెడీనా?” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సవాల్ విసిరారు.
“ఇయ్యాళ్ల కేటీఆర్ మీద, నా మీద, మా నాయకుల మీద ఇన్ని ఆరోపణలు చేశావు కదా. బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలో కావొచ్చు. లేదు కాంగ్రెస్ వచ్చిన డిసెంబర్ 7 2023 నుంచి ఈ రోజు వరకు భూభారతి వరకు నీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో, మా హయాంలో ఏం జరిగినయో మొత్తం మేం విచారణకు సిద్దం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా.? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా? సుప్రీం కోర్డు సిట్టింగ్ జడ్జితో చేయిద్దాం” అని స్పష్టం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు దిగుతున్నారని విమర్శించారు. మొత్తం రేవంత్ రెడ్డి అబద్దాలు, అర్థ సత్యాలు చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని, ఆయన మాట్లాడినవన్నీ కూడా పచ్చి అబద్దాలని ఆరోపించారు. “మేం సభలో ఉంటే మీ బండారాన్ని బయటపెడతామని, మీ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని, నీ తమ్ముడి కుంభకోణాలు బయటపెడతామని, నీ కుటుంబ కుంభకోణాలన్నీ బయటకొస్తాయని సభ నుంచి సస్పెండ్ చేసింది నువ్వు కదా?” అని ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తే ఒక్క రోజు చేయొచ్చు కదా, మొత్తం సెషన్కు ఎందుకు చేసినవ్ అని నిలదీశారు.

More Stories
అమెరికా క్రైస్తవ బృందం సీబీఐ ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనలు కేసు
మోదీ దూరదృష్టితో అద్భుత మార్పు సాధిస్తున్న భారత్
రజాకార్ల అరాచకాలు నుండి హైదరాబాద్ విమోచనం పొందిన రోజు