యువత ఆలోచనా విధానం, వారి ఆశధయాలు, సృజనాత్మక సామర్థ్యం, భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు, దేశ నిర్మాణంలో వారి పాత్రపై విశాఖపట్నం సమీపంలోని గుడిలోవ విజ్ఞాన విహార్ ఆవాసీయ విద్యాలయ ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమన్వయ బైఠక్ లో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో సమాజం, దేశం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘ్ ప్రేరిత సంస్థల ప్రముఖ బాధ్యులు, కార్యకర్తలు ఈ బైఠక్లో పాల్గొన్నారు.
యువతతో కేవలం ఉపదేశాత్మక సంభాషణకు బదులుగా వారితో ప్రత్యక్షంగా అనుసంధానం కావడం, వారి భావాలు, ఆందోళనలను అర్థం చేసుకోవడం, సంభాషణ ద్వారా దేశం, సంస్కృతి, సామాజిక విలువల పట్ల ఆత్మీయతను పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు.
కేవలం వ్యతిరేకించడం లేదా ఆటంకాలు కలిగించడం ద్వారా పరిష్కారం లభించదని చెబుతూ సానుకూల, నిర్మాణాత్మక దృష్టితో వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం, సమాజం—రెండూ కలిసి ప్రయత్నించాలని తెలిపారు.పకృతి వైపరీత్యాల సమయంలో కార్యక్రమాలు
బైఠక్లో జనసాంఖ్యిక మార్పులు, అసమతుల్యతపై కూడా గంభీరంగా చర్చ జరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వృద్ధాప్యం వైపు వెళ్తున్న జనాభా, తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా ఏర్పడుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశ పరిస్థితులపై చర్చించారు. వివిధ ప్రాంతాలు, సముదాయాల్లో జనాభా నిష్పత్తుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, వాటి సామాజిక ప్రభావాలపై చర్చిస్తూ సమాజంలో సమతుల్యత, సౌహార్దాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించారు.
దేశంలో యువత, విద్యార్థుల వరకు మాదక ద్రవ్యాల వ్యాప్తి పెరుగుతుండటంపై బైఠక్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల స్థాయిలో కాకుండా, మొత్తం సమాజం భాగస్వామ్యంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు, పరిపాలన, పోలీసులు, ఇతర సంబంధిత వర్గాలను కలుపుకొని నశాముక్త సమాజం కోసం సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరంపై చర్చ జరిగింది
అనేక సంస్థలు వివిధ రకాల సమాజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లఘు ఉద్యోగ్ భారతి సూక్ష్మ పరిశ్రమల రంగంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం 41,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ అందించినట్లు కూడా సమాచారం పంచుకున్నారు.
పంచ పరివర్తన్, కుటుంబ ప్రబోధన్
సంఘ్ శతాబ్ది సంవత్సరం నేపథ్యంలో సమాజ పరివర్తన కోసం నిర్దేశించిన *‘పంచ పరివర్తన్’*లోని వివిధ అంశాలపై బైఠక్లో ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ముఖ్యంగా కుటుంబ ప్రబోధన్లో భాగంగా భారతీయ కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు, తరతరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయాలను బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చించారు.
పర్యావరణ పరిరక్షణ విషయంలో కేవలం తీర్మానాలు చేయడానికి పరిమితం కాకుండా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం రోజువారీ జీవితంలో మార్పులు తీసుకురావాలని నొక్కిచెప్పారు. నీటిని వివేకవంతంగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించడం, పచ్చదనాన్ని పెంచడం వంటి అంశాలు ప్రతి కుటుంబం ఆచరణలో భాగం కావాలని పేర్కొన్నారు.
కుత్రిమ మేధ (ఏఐ) సమాజంపై చూపుతున్న పెరుగుతున్న ప్రభావం గురించి బైఠక్లో విస్తృత ప్రజెంటేషన్, చర్చ జరిగింది. ఏఐలోని సానుకూల అవకాశాలతో పాటు దానికి సంబంధించిన జాగ్రత్తలు, సవాళ్లపై చర్చిస్తూ, దీనిని భారతీయ దృష్టికోణం, భారతీయ సామాజిక సందర్భంలో చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సాంకేతికతను సమాజ హితం కోసం ఎలా ఉపయోగించాలి, దాని వల్ల సంభవించే ప్రతికూల ప్రభావాలపై సమాజాన్ని ఎలా జాగృతం చేయాలి అనే అంశంపై ముందు కూడా చింతన కొనసాగుతుంది.
సంఘ్ ప్రేరిత 32 సంస్థలు సమాజంలోని వివిధ రంగాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల విస్తరణపై కూడా చర్చ జరిగింది. జాతీయ దృష్టి, సమాజ కేంద్రిత చింతనను సమాజంలోని మరిన్ని రంగాలకు చేరవేయడం, సంస్థాగత కార్యాన్ని విస్తరించడం కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు.

More Stories
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
ఉచితాలకోసం అప్పులు చేస్తూ పరిహారాలు, జీతాలు చెలించరే?