థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఒక పబ్ను దగ్ధం చేశాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా 27మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పబ్ లోపలున్న కుర్చీలు, బల్లలు క్షణాల్లో కాలి బూడిదయ్యాయి.
ఒక పబ్లో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ప్రమాద సమయంలో పబ్ ముందు తలుపుల నుంచి భారీగా మంటలు ఎగిసిపడటం, ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ప్రమాద స్థలాన్ని థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ పరిశీలించారు.
ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని క్లబ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పబ్లో కేవలం ఒకే ప్రధాన ద్వారం ఉండటంతో జనాలు ఒకేసారి బయటకు రావడానికి నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం పెరిగినట్లు రెస్క్యూసిబ్బంది తెలిపారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా అత్యవసర ద్వారాలకు తాళాలు వేసి ఉంచడం కూడా ప్రాణ నష్టానికి కారణమని తెలిసింది.
పబ్ లోపల శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి వాడిన సౌండ్-ప్రూఫింగ్ ఫోమ్ కారణంగా మంటలు క్షణాల్లో పబ్ మొత్తం వ్యాపించాయని ప్రాథికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత పబ్ లోపల కుర్చీలు, బల్లలు పూర్తిగా కాలి బూడిదైన దృశ్యాలు అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
తొలి స్పందనదారులు ఆన్లైన్లో పంచుకున్న వీడియోలలో, పబ్ను మంటలు చుట్టుముడుతుండగా, ప్రవేశ ద్వారం నుండి దట్టమైన పొగ వెలువడటం కనిపించింది. దట్టమైన నల్లటి పొగ రాత్రి ఆకాశంలోకి లేస్తుండగా, ప్రజలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. మంటలను ఆర్పివేసిన తర్వాత తీసిన చిత్రాలలో, ఆ ప్రదేశం లోపల కాలిపోయిన ఫర్నిచర్ మరియు బాగా మాడిపోయిన లోపలి భాగంతో సహా విస్తృతమైన నష్టం జరిగినట్లు చూపించాయి.

More Stories
ఇజ్రాయెల్లో అక్టోబర్ 27న సార్వత్రిక ఎన్నికలు
భర్త చేతిలో భారత సంతతి గూగుల్ లీడ్ ఇంజనీర్ దారుణ హత్య
కశ్మీర్ను పాక్ లో చూపిస్తారా?.. బంగ్లాపై నిప్పులు చెరిగిన భారత దౌత్యవేత్త!