పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని లేక్ ల్యూసెర్న్లో చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అయితే,
తొలి విడత సాంకేతిక స్థాయి చర్చలు జరిపాయి. 80 నిమిషాల తీవ్ర చర్చల అనంతరం, ఇరు దేశాల ప్రతినిధి బృందాలు “అంతర్గత సంప్రదింపులు” జరిపేందుకు వీలుగా సమావేశాన్ని నిలిపివేశారని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఈ చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తులు కూడా పాల్గొన్నారు.
అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాచేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఫీ పాల్గొన్నారు. అమెరికాతో కుదిరే ఏ ఒప్పందమైనా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో శాంతిని చేకూర్చేలా ఉండాలని ఇరాన్ కోరుతోంది.
ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ ప్రకారం, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ఇరాన్ అధికారులతో మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశం మేరకు టెహ్రాన్తో తమ సంబంధాలను “మూలభూతంగా మార్చడానికి” వాషింగ్టన్ సిద్ధంగా ఉందని, ఇరు దేశాలు తమ దౌత్య సంబంధాలలో “కొత్త అధ్యాయం” ప్రారంభించాలని ప్రోత్సహించింది.
అయితే, మొదటి రోజు చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తావనకు రాలేదని ఇరాన్ మీడియా పేర్కొంది. “ఇంత ఉన్నత స్థాయిలో ఇరాన్, అమెరికా నాయకత్వాలు మునుపెన్నడూ సమావేశం కాలేదు. గత కొన్ని గంటల్లోనే మనం గొప్ప పురోగతి సాధించాం, రాబోయే గంటల్లో మరింత పురోగతి సాధిస్తామని నేను ఆశిస్తున్నాను,” అని వాన్స్ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
స్విట్జర్లాండ్లో జరిగిన తాజా అమెరికా-ఇరాన్ దౌత్య చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ, వాన్స్ ఆదివారం ఈ చర్చలను ఒక “చారిత్రాత్మక సమావేశం”గా అభివర్ణించారు. ఇప్పటికే “గొప్ప పురోగతి” సాధించబడిందని ఆయన చెప్పారు. అయితే, జూన్ 18 ఇస్లామాబాద్ మెమోరాండం కింద వాషింగ్టన్ కీలక కట్టుబాట్లను నెరవేర్చనంత వరకు తుది పరిష్కారంపై చర్చలు ముందుకు సాగలేవని టెహ్రాన్ స్పష్టం చేసింది.
ఈ చర్చలు ఒక కీలకమైన ప్రారంభ బిందువే అయినప్పటికీ, అవి తక్షణ పరిష్కారాన్ని అందించే అవకాశం లేదని వాన్స్ హెచ్చరించారు. దౌత్య ప్రక్రియలోని సంక్లిష్టతలను నొక్కిచెబుతూ, ఆయన ఇలా అన్నారు, “శాంతి ఎప్పుడూ సులభం కాదు. శాంతికి ఎల్లప్పుడూ కొంత కృషి అవసరం. దానికి ఎల్లప్పుడూ కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు అవసరం.”
‘లెబనాన్తో యుద్ధాన్ని ముగించాలన్నది మొదటి నిబంధన. దీనిని అమల్లోకి తీసుకురాకుండా చర్చ ల్ని ప్రారంభించటం కుదరదు’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

More Stories
హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్
శ్రీరాముడి చిత్రపటం అపవిత్రంపై ఢాకాలో భారీ నిరసనలు
ఫోటో దిగేందుకు అడుక్కుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై మెలోని మండిపాటు