పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో ఆదివారం ఉదయం 7.14 గంటలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతులు రామాలయ పునఃనిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు ఆకివీడులో రామాలయం నిర్మాణానికి కావాల్సిన అనుమతులను సకాలంలో అందించినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆకివీడులో రామాలయం నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకుంటామని కొంతమంది హెచ్చరించిన నేపథ్యంలో పోలీసుల భద్రత మధ్యన ఈ కార్యక్రమం చేపట్టినట్లు రఘురామ వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కృష శిలాతో ఏడు నెలల్లో రామాలయం నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు పెదపేటలో రామాలయం నిర్మాణాన్ని కొన్ని దళిత సంఘాలు, బీఎస్పీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గొంతెనమ్మ గుడి ప్రాంగణంలో రామాలయం నిర్మించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటూ బీఎస్పీ పార్టీ ఛలో ఆకివీడుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆకివీడులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

More Stories
కల్తీ నెయ్యికి ధర్మారెడ్డి, వైఎస్సార్సీపీ కీలక నేతలే కారకులు
పోలవరంలో వేగం కనిపించని పనులు, నిధుల వ్యయంలో జాప్యం!
ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య