కాగా, ఇరాన్తో చారిత్రాత్మక దౌత్యపరమైన పురోగతిని సాధించేందుకు తమ ప్రభుత్వం దగ్గరలోనే ఉందని వైట్హౌస్ తెలిపింది. గత దౌత్య ప్రయత్నాలతో పోలుస్తూ, అమెరికా అధ్యక్షుడు అనుసరించిన విలక్షణమైన విధానమే ఈ పురోగతికి కారణమని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా, ఇరాన్తో ఒక మంచి డీల్కు అమెరికా ఎప్పుడూ ఇంత దగ్గరగా రాలేదని తెలిపారు.
ఈ చర్చల ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయించడం అని ట్రంప్ స్పష్టం చేశారు. “ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు” అని ఆయన తెలిపారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అయితే ఇరాన్ ఓడరేవులపై తాము విధించిన దిగ్బంధనాన్ని ధిక్కరించే ఏ నౌకనైనా స్వాధీనం చేసుకుంటామన్న తన హెచ్చరికను అమెరికా ఆదివారం అమలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్తో ఆ సంబంధం ఉన్న ఎం/వీ టౌస్కా నౌకపై ఉత్తర అరేబియా సముద్రంలో ఒక క్షిపణి విధ్వంసక నౌక కాల్పులు జరుపడం, ఆ తర్వాత ఆగిపోయిన నౌక డెక్పైకి హెలికాప్టర్ల నుండి తాడు సాయంతో సైనికులు దిగిన దృశ్యాలు ఉన్న వీడియో ఫుటేజ్ని అమెరికన్ సైన్యం విడుల చేసింది.
ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణను పొడిగించే అవకాశం ‘దాదాపు తక్కువ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే, అది ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యానికే కాకుండా యూరప్, అమెరికా, ఇంకా మిగతా అన్ని దేశాలకూ శాంతి, భద్రత, సురక్షితత్వాన్ని హామీ ఇస్తుందని మంగళవారం వైట్ హౌస్ పేర్కొంది.

More Stories
భారత- శ్రీలంక ఒప్పంద స్ఫూర్తిని గుర్తు చేసిన శ్రీలంక తమిళ పార్టీలు
జడ్జిని తప్పించాలన్న కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేత
దళితులకు నేపాల్ ప్రభుత్వం పక్షం రోజుల్లో `క్షమాపణలు’