జపాన్లో ఇవాళ శక్తివంతమైన భూకంపం నమోదు అయ్యింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.4గా ఉంది. దీంతో జపాన్ వాతావరణ శాఖ సునామీ వార్నింగ్ జారీ చేసింది. సుమారు మూడు మీటర్ల ఎత్తుతో సముద్ర అలలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నది. ఉత్తరంలోని ఇవాటే రాష్ట్ర సమీప జలాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు. చాలా శక్తివంతంగా భూమి కంపించడంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో కూడా బిల్డింగ్లు షేక్ అయినట్లు తెలుస్తోంది.
ఉత్తర తీరానికి సుమానీ అలలు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ ఏజెన్సీ పేర్కొన్నది. కోస్టల్ ప్రాంతాలను నుంచి తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సునామీ అలల వల్ల డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉన్నట్లు చెప్పారు. హెచ్చరికను వెనక్కి తీసుకునే వరకు ఎవరూ తీరానికి వెళ్లకూడదని ప్రభుత్వం పేర్కొన్నది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
జపాన్ ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి. ఇది నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై ఉంది. ఇవి నిరంతరం ఒకదానికొకటి తోసుకుంటూ కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఈ దేశం, తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఒక కీలక భాగంగా మారింది. ఈ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1,500 భూకంపాలు సంభవిస్తాయని నివేదికలు చెబుతున్నాయి.
అంటే, దేశంలో ఎక్కడో ఒకచోట దాదాపు ప్రతిరోజూ భూకంప కార్యకలాపాలు నమోదవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మొత్తం భూకంపాలలో సుమారు 18% జపాన్లోనే సంభవిస్తాయి, ఇది భూమిపై అత్యంత చురుకైన ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుంది. జపాన్ చరిత్రలో అత్యంత వినాశకరమైన సంఘటనలలో ఒకటి 2011 నాటి భూకంపం, సునామీ. 9.0 తీవ్రత గల శక్తివంతమైన భూకంపం భారీ సునామీ అలలను ప్రేరేపించింది. సుమారు 18,500 మంది మరణించారు లేదా గల్లంతయ్యారు. ఈ విపత్తు ఫుకుషిమా విద్యుత్ కేంద్రంలో తీవ్రమైన అణు ప్రమాదానికి కూడా దారితీసింది
జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచి, ఎక్స్ లో ఒక పోస్ట్లో ఇలా తెలిపారు: “ఈరోజు సాయంత్రం సుమారు 4:53 గంటలకు, సాన్రికు తీరానికి దూరంగా భూకంప కేంద్రంతో ఒక భూకంపం సంభవించింది. దీని ఫలితంగా ఆమోరిలో జపనీస్ స్కేలుపై గరిష్టంగా 5 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. అదనంగా, ఇవాటే ప్రిఫెక్చర్, హోక్కైడో పసిఫిక్ తీరంలోని మధ్య భాగం, మరియు ఆమోరి ప్రిఫెక్చర్ పసిఫిక్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. సునామీ హెచ్చరికలు జారీ చేయబడిన ప్రాంతాల్లోని నివాసితులు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా తరలింపు భవనాలకు, ఇతర ఎత్తైన, సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్లాలి.”

More Stories
అమెరికాతో రెండో విడత చర్చలకు ఇరాన్ దూరం
శ్రీలంక అధ్యక్షుడితో ఇంధన భద్రతపై ఉపరాష్ట్రపతి చర్చలు
ఇటలీలో ఇద్దరు భారతీయులు గురుద్వారా సమీపంలో కాల్చివేత