బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్కి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై, పార్టీ పరిస్థితులపై ముచ్చటించారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోదీ అభినందించినట్టు పేర్కొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారుని, నాయకుల, కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలు అడిగారని సంజయ్ ఆ ప్రకటనలో చెప్పారు.
‘టీఆర్ఎస్ పార్టీ డబ్బుల పంపకం, దౌర్జన్యాల గురించి మోడీ నన్ను వివరాలు అడిగారు. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా పనిచేసిన బీజేపీ రాష్ట్ర శాఖకు మోడీ శుభాకాంక్షలు చెప్పారు’ అని సంజయ్ వివరించారు.
పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాని మోదీ కొనియాడారని పేర్కొన్నారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారని చెప్పారు.
దైర్యంగా ముందుకు సాగాలని అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెబుతూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించినట్టు తెలిపారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు