గత నెలలోనే, మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు సమాచారం. అతను జైష్-ఎ-మహ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అన్నయ్య. అతను జైష్-ఎ-మహ్మద్లో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.
గత ఏడాది మార్చిలో, లష్కర్-ఎ-తైబాకు చెందిన అగ్రశ్రేణి ఉగ్రవాది, అబు ఖతల్ అలియాస్ ఖతల్ సింధీ పాకిస్థాన్లోని ఝేలం సింధ్లో గుర్తుతెలియని దుండగుల చేతిలో హతమయ్యాడు. అతను 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు సన్నిహితుడు. 2024లో జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది మందిని చంపి, 33 మందిని గాయపరిచిన రియాసి దాడి వెనుక కూడా ఇతనే సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి.
ఏడు నెలల వ్యవధిలో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చడంతో, 2023లో ఇలాంటి హత్యల తీరు స్పష్టమైంది. హతమైన ఏడుగురిలో ఒకరైన ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్జిత్ సింగ్ పంజ్వార్ చాలా కాలంగా ఆయుధాల స్మగ్లింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు.
2023 మే 6న, లాహోర్లోని జోహర్ టౌన్లో మామూలుగా నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని సమీపించి కాల్చి చంపారు. హఫీజ్ సయీద్కు మరో సన్నిహితుడైన ముఫ్తీ ఖైసర్ ఫరూఖ్ను కరాచీలో “గుర్తుతెలియని వ్యక్తులు” హత్య చేశారు. 30 ఏళ్ల ఫరూఖ్ను 2023 అక్టోబర్లో సమనాబాద్ ప్రాంతంలోని ఒక మత సంస్థ సమీపంలో కాల్చి చంపారు.
ఫరూఖ్ వీపుపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 2016 పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారిగా ఆరోపించబడిన షాహిద్ లతీఫ్ను, 2023 అక్టోబర్లో పాకిస్థాన్లోని సియాల్కోట్లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. 54 ఏళ్ల వయసున్న ఇతను, భారతదేశం ‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల’ జాబితాలో ఉన్నాడు. లష్కర్-ఎ-తైబాలో ఉన్నత స్థాయి కమాండర్ అయిన ఖ్వాజా షాహిద్ (మియా ముజాహిద్గా కూడా పిలువబడతాడు) మృతదేహంను 2023 నవంబర్లో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో నరికివేసిన స్థితిలో కనుగొన్నారు.

More Stories
ప్రతిపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కొంటారు
లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో రాహుల్ పై కేసు