దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఇంధన కొరత సమస్య ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని ఆయన తెలిపారు. ఇంధన అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా ఈ విభాగంలో స్వయం సమృద్ధి కోసం భారత సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని చెప్పారు.
దీనివల్లే దేశంలో ఎక్కడా ఇంధన కొరత అనేది లేదని గడ్కరీ చెప్పారు. భారత్ వినియోగించే ఇంధన వనరుల్లో 86 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటామని, కానీ ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కుల వంటివి ఇంధన స్వయం సమృద్ధికి ఊతమిచ్చాయని తెలిపారు. దేశంలో ఈ కొత్తరకం వాహనాల సేల్స్ 40 నుంచి 50 శాతం పెరిగాయని గడ్కరీ పేర్కొన్నారు.
హైడ్రోజన్ ఆధారిత వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడంపైనా తాము దృష్టి సారించామని ఆయన తెలిపారు. 100శాతం ఇథనాల్పై నడిచే వాహనాలనూ తీసుకొస్తామని గడ్కరీ వెల్లడించారు. స్వయం సమృద్ధ భారత్ను సాధించేందుకు మనం ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించాలని స్పష్టం చేశారు. సోలార్ పవర్పైనా భారత్ ఫోకస్ ఉందని ఆయన చెప్పారు.
“సహజంగానే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మనం 86 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. కానీ మేము ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చాము. మేము హైడ్రోజన్పై పనిచేస్తున్నాము. ఇథనాల్ వాహనాలు ఉన్నాయి. మేము 100 శాతం ఇథనాల్తో నడిచే వాహనాలను తీసుకువస్తున్నాము. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, మనం దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచాలి,” అని ఆయన పేర్కొన్నారు.
“నేడు, శిలాజ ఇంధనాల దిగుమతి కోసం మనం రూ. 22 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం, మనం సౌర విద్యుత్తుపై దృష్టి సారిస్తున్నాం. ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు 40-50 శాతం మేర పెరిగాయి. అసోంలోని నుమాలిగఢ్లో మేము వెదురు గడ్డి ఆధారిత బయోఇథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. ఆ ఇథనాల్ను 20 శాతం మేర పెట్రోల్లో మిళితం చేస్తున్నాం. ఇథనాల్ ఆధారిత ట్రక్కులు అందుబాటులోకి వస్తున్నాయి, త్వరలో కార్లు కూడా రానున్నాయి,” అని ఆయన వివరించారు.
అసోంలోని నుమాలీఘర్లో వెదురు గడ్డితో బయో ఇథనాల్ను తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం భారత్ పెట్రోలులో 20 శాతం ఇథనాల్ను కలుపుతోందని, ఇథనాల్తో నడిచే ట్రక్కులు, కార్లను మార్కెట్లోకి తీసుకొస్తామని వివరించారు.

More Stories
వచ్చే 3 ఏళ్లలో 80 శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఏఐ ముప్పు!
ఏప్రిల్లో చమురు సరఫరాలో అంతరాయం రెట్టింపు
ఐప్యాక్ కార్యాలయాలలో ఈడీ సోదాలు