జాతీయ భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా, ఏప్రిల్ 1 నుంచి చైనాలో తయారైన సీసీటీవీ కెమెరాలపై భారతదేశం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ చర్య ప్రధానంగా హిక్విజన్, దహువా టెక్నాలజీ, టీపీ-లింక్ వంటి కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. ఈ నిర్ణయం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నిఘా పరికరాల మార్కెట్ను పునర్రూపకల్పన చేస్తుందని, స్థానిక తయారీదారులకు బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
కోత్త ప్రభుత్వ ధృవీకరణ నిబంధనల ప్రకారం, కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించనంత వరకు చైనా బ్రాండ్లు భారతదేశంలో ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత నిఘా పరికరాలను విక్రయించడానికి అనుమతించరు. భారత మార్కెట్లో నిఘా పరికరాలను విక్రయించే ముందు తయారీదారులు అధికారిక అనుమతి పొందడాన్ని ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.
కంపెనీలు చిప్సెట్ల వంటి కీలక భాగాల మూలాన్ని వెల్లడించాలి. సైబర్ సెక్యూరిటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. అనధికారిక రిమోట్ యాక్సెస్ నుండి పరికరాలకు రక్షణ ఉంటుందని నిర్ధారించుకోవాలి. సీసీటీవీ వ్యవస్థలను కీలకమైన మౌలిక సదుపాయాలుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే అవి విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు, రవాణా కేంద్రాలు వంటి సున్నితమైన ప్రదేశాలను పర్యవేక్షిస్తాయి.
విదేశాలలో తయారైన నిఘా పరికరాలు డేటా లీక్లకు, అనధికారిక రిమోట్ యాక్సెస్కు, భద్రతా నెట్వర్క్లపై బయటి నియంత్రణకు దారితీయవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ లేని సీసీటీవీ యూనిట్ల అమ్మకాలను 2025 ఏప్రిల్ 9 నుంచి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ నిషేధించింది.
కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సీసీటీవీ కెమెరాలను అమ్ముకోవడానికి వ్యాపారులకు 2026 మార్చి 31 వరకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి స్వదేశంలోని తయారైన సీసీటీవీ కెమెరాలనే భారత వ్యాపారులు అమ్మాల్సి ఉంటుంది. ఏ చైనా కంపెనీ తమ ఉత్పత్తులకు స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ధ్రువీకరణ ఇవ్వక పోవడంతో భారత్లో ఏప్రిల్ 1 నుంచి చైనా సీసీటీవీ కెమెరాల అమ్మకాలపై నిషేధం అమలులోకి వచ్చినట్లు కాగలదు.
అయితే, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ లేని సీసీటీవీ కెమెరాల అమ్మకాలను దేశంలో నిషేధించే ఉత్తర్వు 2025 ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు దేశంలోని ఏ తయారీదారుడిపైనా ప్రభావం చూపదని వెల్లడించారు.
జాతీయ భద్రతను బలోపేతం చేయడం, సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలను తగ్గించడం, చైనా సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి ప్రభుత్వ విస్తృత ప్రయత్నంలో ఈ నిర్ణయం ఒక భాగం. అనుసంధానించే సీసీటీవీ వ్యవస్థలను సున్నితమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే వాటిని రిమోట్గా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఇది నిఘా, డేటా గోప్యతకు సంబంధించి ఆందోళనలను రేకెత్తిస్తుంది.
ఈ మార్పు ఇప్పటికే భారతదేశ నిఘా పరిశ్రమ స్వరూపాన్ని మార్చేసింది. ప్రస్తుతం దేశీయ బ్రాండ్లు 80 శాతానికి పైగా మార్కెట్ను నియంత్రిస్తున్నాయి అనేక సంస్థలు చైనాయేతర భాగాలకు మారాయి. వాస్తవానికి, కొన్ని చైనా కంపెనీలు తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి లేదా పూర్తిగా నిష్క్రమించాయి.

More Stories
విమాన ఇంధనం ధరలు రెట్టింపు, వాణిజ్య గ్యాస్ రూ 195.50 పెంపు
2.5 శాతంకు పెరిగిన యూరప్ ద్రవ్యోల్బణం రేటు
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. నేరుగా కేంద్రమే నోటీసులు!