బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. మార్చి 16న బీహార్ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు, ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి 14 రోజుల గడువును రాజ్యాంగం నిర్దేశించింది. మార్చి 30తో ఈ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఏప్రిల్ 9న నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పలు రాజకీయ కూటములు మారుతూ రికార్డు స్థాయిలో బీహార్ పదో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ త్వరలో ఆ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. అయితే బీహార్ చరిత్రలో తొలిసారి బీజేపీ నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌదరి ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు.

More Stories
జనగణనలో సహజీవన జంటలకు కుటుంబ హోదా
లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్
వరుసగా 12 ఏటా శక్తివంతమైన భారతీయులుగా మోదీ, అమిత్ షా