శ్రీలంకకు భారత్ 38 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియంను పంపింది. ఇందులో 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ ఉన్నాయి. కొలంబోలోని భారత హైకమిషన్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయం కారణంగా శ్రీలంక ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభాన్ని తగ్గించడంలో ఈ సహాయం కీలక పాత్ర పోషిస్తుందని ఆ దేశ నాయకులు తెలిపారు.
ఈ ఇంధన సరఫరా అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే మధ్య గతవారం జరిగిన టెలిఫోన్ సంభాషణ తర్వాత జరిగింది. శ్రీలంక ఐఒసి గతంలో పశ్చిమ ఆసియా, సింగపూర్ నుండి మార్చి నెల కోసం ఇంధన సరఫరాలను పొందింది. అయితే, ఒప్పందాలు కుదుర్చుకున్న సరఫరాదారులు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా సరఫరా అంతరాయాలు, నౌకల లభ్యత లేకపోవడం వల్ల ఉత్పత్తులను అందించలేమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ఐఒసిఎల్ ద్వారా 38,000 మెట్రిక్ టన్నుల అత్యవసర సరఫరాలను అందించాలని భారత్ను అభ్యర్థించారు. భారత ప్రభుత్వం, లంకా ఐఒసి ద్వారా శ్రీలంకకు ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగడానికి మద్దతు ఇస్తోంది. భారత్ అందించిన ఈ ఇంధన సహాయం శ్రీలంకకు ప్రస్తుత సంక్షోభ సమయంలో గణనీయమైన ఉపశమనాన్ని అందిచనుంది.

More Stories
అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం
వీవీఐపీల విమానాలకు కొత్త నియమావళి
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర చమురు తెట్టు