* చైనా ఐదు సూత్రాల ప్రతిపాదన
ఇరాన్పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు (పీ-5) భేటీ కావాలని రష్యా పిలుపునిచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయం తీవ్రంగా చచ్చుబడి పోయిందని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు భేటీ కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభ కాలానికి ముందు కూడా ఒకసారి ఇదే ప్రతిపాదనను పుతిన్ చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ భద్రత, సుస్థిరతలపై చర్చించేందుకు పీ-5లోని రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, యూకే భేటీ కావాలని పుతిన్ కోరుకుంటున్నారని దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అంతర్జాతీయ న్యాయం అనేది దాదాపు నశించిపోయిందని, ఇలాంటప్పుడు అంతర్జాతీయ న్యాయంలోని నిబంధనలు, సూత్రాలను అనుసరించమని ఇతరులకు ఎలా చెప్పగలమో తనకు అర్థం కావడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి అంతర్జాతీయ న్యాయం అనేది ఇంకా మిగిలి లేదని పెస్కోవ్ స్పష్టం చేశారు. “ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు చేశాక పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. యావత్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న సైనిక ఘర్షణల సంఖ్య కూడా పెరిగింది. వీటి ఫలితంగా ప్రతికూలమైన రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పెస్కోవ్ హెచ్చరించారు.

More Stories
ఇరాన్పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు
భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు కావాలి
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా మోజ్తాబా ఖమేనీ