మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉక్రెయిన్ను వైమానిక రక్షణ క్షిపణులను సమకూర్చుకోవడానికి ఇబ్బంది పెట్టవచ్చని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదంతో ఉక్రెయిన్ మిత్రదేశాలు పరధ్యానం చెందే ప్రమాదం ఉందని, రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు వ్యతిరేకంగా తన దేశ రక్షణను మరచిపోయే ప్రమాదం ఉందని కూడా ఆయన తెలిపారు.
“మా ఆకాశాన్ని రక్షించుకోవడానికి క్షిపణులు, ఆయుధాలను పొందడంలో మేము ఇబ్బంది పడవచ్చు” అని ఆయన ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాతో పేర్కొన్నారు. “మధ్యప్రాచ్యంలోని అమెరికన్లు, వారి మిత్రదేశాలు తమను తాము రక్షించుకోవడానికి అవి అవసరం కావచ్చు, ఉదాహరణకు పేట్రియాట్ క్షిపణులు” అని చెప్పారు.
మధ్యప్రాచ్యంపై దృష్టి సారించి అమెరికా, ఐరోపాయూనియన్ ఉక్రెయిన్ రక్షణను మరచిపోయే ప్రమాదం ఉందా? అని అడిగినప్పుడు, జెలెన్స్కీ ఇలా సమాధానమిచ్చారు: “వాస్తవానికి, ఇది ఒక ప్రమాదం. కానీ ఇరాన్ సంక్షోభం పరిమిత ఆపరేషన్గా మిగిలిపోయింది. సుదీర్ఘ యుద్ధంగా మారదని నేను ఆశిస్తున్నాను. అది ఎంత రక్తపాతంగా మారుతుందో మనకు ప్రత్యక్షంగా తెలుసు.”
సంవత్సరాలుగా ఉక్రెయిన్ ప్రపంచం దృష్టిలో ఉండటానికి అలవాటు పడింది. రష్యా తన పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన క్షణం భయంకరమైన నాల్గవ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ గత వారం కైవ్ వీధులు పాశ్చాత్య నాయకులతో నిండిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత, ఉక్రెయిన్ రాజధానిలో ప్రజలు మరొక సంఘర్షణ వైపు దృష్టి మళ్లించడాన్ని దాదాపుగా స్పష్టంగా భావించారు.
కైవ్లో డ్రోన్ దాడులకు గల్ఫ్ నివాసితుల ప్రతిచర్యను ఇక్కడ కొందరు ఎత్తి చూపారు. ఇది భుజాలు తడుముకోవడమే తప్ప మరేమీ కాదు. కానీ మధ్యప్రాచ్యంలో పోరాటం వారికి ఏమి సూచిస్తుందో మరింత భయంగా ఉంది. జెలెన్స్కీ వ్యాఖ్యలు ఆ అనిశ్చితిని వివరిస్తాయి. ఒక వైపు దిగులుగా ఉన్నాడు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ రక్షణ మరచిపోగల యుద్ధంగా మారే ప్రమాదాలను ఆందోళన చెందుతున్నాడు.
అమెరికా, రష్యాలతో తాజా ప్రణాళికాబద్ధమైన చర్చలు జరుగుతాయా? అనే దానిపై ఇప్పటికే అనిశ్చితి ఉంది. గల్ఫ్ దేశాలు ప్రయోగిస్తున్న భారీ సంఖ్యలో వాయు రక్షణ ఇంటర్సెప్టర్ క్షిపణులు ప్రపంచ కొరతకు దారితీయవచ్చని, అలాంటి ఆయుధాలను మరింత ఖరీదైనవిగా, కనుగొనడం కష్టతరం చేస్తాయని కూడా అతనికి తెలుసు.
గత వేసవిలో ఇజ్రాయెల్, యుఎస్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసినప్పుడు అది ఖచ్చితంగా నిజం.
“ఇజ్రాయెల్ అప్పుడు ఇరాన్ దాడిలో ఉంది. మాకు క్షిపణి డెలివరీ కార్యక్రమాలు మందగించాయి” అని జెలెన్స్కీ గుర్తు చేసుకున్నారు. “ఇది ఇంకా జరగలేదు, కానీ అది మళ్ళీ జరగవచ్చని నేను భయపడుతున్నాను” అని చెప్పారు. ట్రూత్ సోషల్లో, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాకు “అపరిమిత ఆయుధాల సరఫరా” ఉందని పేర్కొన్నారు. కానీ తన పోస్ట్ను ఉపయోగించి జెలెన్స్కీని “పిటి బర్నమ్” అని ఎగతాళి చేశారు. అతను 19వ శతాబ్దపు అమెరికా షోమ్యాన్, మోసగాడు. ఉక్రెయిన్ నాయకుడు అధ్యక్షుడు జో బిడెన్ను మోసగించి చాలా అమెరికా ఆయుధాలను ఉచితంగా పొందాడని అర్ధం కావచ్చు.
అయినప్పటికీ, జెలెన్స్కీ కూడా సానుకూలతల కోసం చూస్తున్నాడు. ఇరాన్ రష్యాకు పదివేల షాహెద్ డ్రోన్లను విక్రయించింది. ఇవి దాదాపు రాత్రిపూట ఉక్రెయిన్పై ఘోరమైన విధ్వంసం సృష్టిస్తాయి. అది ఆగిపోవచ్చు. “ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడి చేయడం మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను” అని ఆయన చెప్పారు.
“ఇరానియన్లు రష్యా కోసం చాలా ఆయుధాలను ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులు, అయినప్పటికీ వారు ఇకపై అలా చేయలేరని నేను అనుకుంటున్నాను” అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ డిజైన్ను తీసుకొని ఉక్రేనియన్ నగరాలపై దాడుల కోసం దానిని సవరించిన తర్వాత, రష్యా ఇప్పుడు షాహెద్లను దేశీయంగా కూడా ఉత్పత్తి చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డ్రోన్ టెక్నాలజీ, నైపుణ్యంతో గల్ఫ్ భాగస్వాములకు మద్దతు ఇవ్వగలిగితే, కైవ్ ఆర్థికంగా, రాజకీయంగా కూడా ప్రయోజనం పొందవచ్చు, కానీ, జెలెన్స్కీ ఎత్తి చూపినట్లుగా, రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే అది జరగవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్కు మద్దతు ఇవ్వడంలో విఫలమవడం రష్యా అధ్యక్షుడి బలహీనతను చూపిస్తుందని నమ్ముతున్నారు: “అతను మాట్లాడుతాడు, కానీ చర్య తీసుకోడు. అతను ఇరానియన్ల బలహీన మిత్రుడని నిరూపిస్తాడు. అతను బషర్ అస్సాద్ సిరియాతో ఉన్నట్లే.”

More Stories
సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ముజ్తబా
సున్నీ, షియా ముస్లింల మధ్య ప్రధాన తేడాలేంటి?
నాలుగు రోజుల యుద్ధానికే క్షీణిస్తున్న ఆయుధ సంపత్తి