భారతదేశంలో బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన సమాచారం అందించడమే తన విధానాల లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానం ప్రత్యేకంగా మహిళలు, పిల్లలను ఆన్ లైన్ హాని నుండి రక్షించడంపై దృష్టి పెడుతుంది. ఇంటర్నెట్ లో చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ ప్రసారం కాకుండా చూసుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దిశగా చట్టపరమైన, పరిపాలనాస్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఐటీ చట్టం 2000, ఐటీ నియమాలు 2021 డిజిటల్ ప్లాట్ ఫామ్ ల బాధ్యతలను నిర్వచిస్తాయి. ఈ చట్టాలు ఆశ్లీల కంటెంట్, గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ నేరాలకు శిక్షను అందిస్తాయి. పోలీసులకు దర్యాప్తు, శోధన, అరెస్టు చేయడానికి కూడా అధికారం ఉంది. ఐటీ నియమాలు 2021 చట్టవిరుద్ధమైన కంటెంట్ నేను బ్లాక్ చేయడం, తొలగించడం కంపెనీలను స్పష్టంగా ఆదేశిస్తుంది.

More Stories
క్యాన్సర్ నిరోధఖాలున్న 148 లైకెన్ల గుర్తింపు
ఢిల్లీలో సినిమా ప్రచారం కోసం `తప్పిపోతున్న అమ్మాయిలు’ ప్రకటనలు
గడ్చిరోలి జిల్లాలో ముగ్గురు నక్సలైట్లు హతం