
ససారం నుంచి రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన స్నేహలత (ఆర్ఎల్ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహా భార్య), ఝంఝార్ పుర్ నుంచి బీజేపీ తరఫున నీతీశ్ మిశ్రా (మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కుమారుడు), ఇమామ్ గంజ్ నుంచి హెచ్ఏఎం తరఫున దీపా మాంఝీ (కేంద్రమంత్రి జితన్ రామ మాంఘీ కోడలు) పోటీలో ఉన్నారు. జన్ సురాజ్ పార్టీ తరఫున మోర్వా నుంచి జాగృతి ఠాకూర్ (లెజెండరీ సోషలిస్ట్ నాయకుడు కర్పూరి ఠాకూర్ మనవరాలు) పోటీలో ఉన్నారు.
జేడీయూ తరఫున గైఘాట్ నుంచి కోమల్ సింగ్ (ఎల్జేపీ ఎంపీ వీణా దేవి కుమార్తె) ఎన్నికల బరిలో దిగారు. జేడీయూ తరఫున నబీనగర్ నుంచి చేతన్ ఆనంద్ (ఎంపీ లవ్లీ ఆనంద్ కుమారుడు) తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున బంకిపుర్ నుంచి నితిన్ నబిన్ (బీజేపీ దివంగత నేత నబిన్ కిషోర్ సిన్హా కుమారుడు) బరిలో దిగారు. కమలం పార్టీ తరఫున దిఘా నుంచి సంజీవ్ చౌరాసియా (బీజేపీ సీనియర్ నేత గంగా ప్రసాద్ చౌరాసియా కుమారుడు) పోటీలో ఉన్నారు.
ఆర్జేడీ తరఫున షాపుర్ నుంచి రాహుల్ తివారీ (ఆర్జేడీ సీనియర్ నాయకుడు శివానంద్ తివారీ కుమారుడు) తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున షాపుర్ నుంచి రాకేశ్ ఓజా (బీజేపీ సీనియర్ నేత విశేశ్వర్ ఓజా కుమారుడు), మొకామా నుంచి వీణా దేవి (ఆర్జేడీ నేత సూరజ్ భాన్ సింగ్ భార్య), లాల్ గంజ్ నుంచి శివాని శుక్లా (ఆర్జేడీ నేత మున్నా శుక్లా కుమార్తె) పోటీ చేస్తున్నారు.
రాజకీయ నేతల వారసులు, కుటుంబ సభ్యులు పాలిటిక్స్లోని ప్రవేశించే విధానాన్ని చూస్తే, ఇప్పుడు అన్ని పార్టీలు సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోందని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వికాశ్ అభిప్రాయపడ్డారు. “తమవారు రాజకీయాల్లో స్థిరపడి ఉంటారు కాబట్టి వారసులు ఈజీగా పాలిటిక్స్లోకి వచ్చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తమ గొంతుకను వినిపించాలి. గత 77 ఏళ్లుగా బిహార్లో విద్యకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల కూడా ఇది జరుగుతోంది” అని వికాస్ పేర్కొన్నారు.
“రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంలో బిహార్లోని ఏ పార్టీ కూడా ఈ విషయంలో నైతిక ఆధిపత్యాన్ని ప్రకటించలేదు. బిహార్లో గ్రామీణ జనాభా విద్యా స్థాయి చాలా తక్కువగా ఉంది. తాజా కుల సర్వే ప్రకారం, బిహార్ జనాభాలో 14.71 శాతం మంది మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వారికి రాజకీయంగా అవగాహన లేదు. అందుకే రాజకీయ పార్టీలు తక్కువ విద్యావంతులైన ఓటర్లను సద్వినియోగం చేసుకుని వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి.” అని వికాస్ తెలిపారు.
ప్రస్తుత కాలంలో ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సాధారణ కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఆలోచించలేడనేది వాస్తవమని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. అదే సమయంలో, ఎన్నికల్లో గ్లామర్ అంతర్భాగంగా మారడంతో సాధారణ పార్టీ కార్యకర్తలకు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ఖర్చు పెరిగిపోవడంతో సాధారణ కార్యకర్తకు పోటీ అనేది అసమానంగా మారిపోయిందని పేర్కొన్నారు.
మరోవైపు, బీజేపీ సంస్థాగతంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాసేవ చేయడానికి నిబద్ధత కలిగినవారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ బిహార్ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు. అందుకు పార్టీలో సంస్థాగతంగా పనిచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉదాహరణగా తీసుకోవచ్చన్నారు. మోదీ ఎటువంటి బ్యాగ్రౌండ్లోకి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు.
More Stories
తగ్గుముఖం పడుతున్న డాలర్ ఆధిపత్యం!
నోటి మాట ప్రచారంతో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు కేంద్ర బిందువు!
26 లక్షల దీపాలతో చరిత్ర సృష్టించిన అయోధ్య దీపోత్సవ్